Prajaasaahithi – Feb & Mar – 2021

admin

Author Posts

                ఆధునిక తెలుగు సాహిత్యానికి కొండంత గుర్తు రావిశాస్త్రిగా ప్రసిద్ధుడైన రాచకొండ విశ్వనాథశాస్త్రి. 2022 ఆయన శతజయంతి సంవత్సరం.  ఆ  మహారచయిత  స్మరణలో  ఆయన  సాహిత్యపు ప్రాసంగికతను గుర్తుచేస్తూ తీసుకువస్తున్న ‘ప్రజాసాహితి’ ప్రత్యేక సంచిక ఇది. ఆధునిక సాహిత్యంతో పరిచయం వున్నవాళ్ళందరూ ఆయన రచనలు చదివి వుంటారు. 1952 నుండి నాలుగు దశాబ్దాల పాటు ఆయన కథ, నవల, నాటకం ప్రక్రియల్లో గొప్ప సాహిత్యం సృజించాడు. ‘మూడు కథల బంగారం’, ‘ఋక్కులు’, ‘ఆరు చిత్రాలు’, ‘ఆరు సారా
Complete Reading

– రావిశాస్త్రి          అన్నారావుని శనిలా వెంటాడుతున్నాడు ముష్టివాడు.          ఆకల్లో అందం కనిపించదు. ఆకల్తో ఉన్నవాళ్లు బొత్తిగా బావుండరు చూడ్డానికి. వాళ్ళనసలు చూడరు చాలామంది. ఇక్కడ ‘‘ఆకలి’’ అంటే ఆకలేకాని మరొకటి కాదు. పుస్తకాలంటే ఆకలి, పరస్త్రీ అంటే ఆకలి, పరాయి సొమ్మంటే ఆకలి, ఆ తరహాది కాదు. ఆకలంటే అసలైన ఆకలి. అంటే ఏమిటో చాలామందికి తెలిసుండాలి.          అతనసలు ఆదినుంచీ ఆకల్తో ఉన్నవాళ్ళా ఉన్నాడు. అంతకాలం అలా ఉంటే మనిషి రూపు మారిపోతుంది. అతను, చెదపుట్టలోంచి తీసిన
Complete Reading

– ఐ.టి.ఆర్‌.వి. శివాజీరావు                 రావిశాస్త్రిగారు చివరగా రాసిన నవల ‘ఇల్లు’. ఈ నవలను 1992లో మొదలుపెట్టి 93లో పూర్తి చేశారాయన. ‘స్వాతి’ వారపత్రికలో సీరియల్‌గా వచ్చింది. నవల పుస్తకరూపం తీసుకోక ముందే ఆయన మరణించారు.                 నవల రచనాకాలం 1992-93, అయితే నవలలోని జరిగిన కథాకాలం 1969 (‘ఇల్లు’ నవలా ప్రవేశంలో రావిశాస్త్రిగారే ఈ విషయం ప్రస్తావించారు). ఈ రెండు కాలాలు రచయిత మీద రచయిత రాసిన కథ మీద జమిలిగా ప్రభావం చూపించకపోవు. ఈ
Complete Reading

– ఓ.వీ.వీ.యస్‌. రామకృష్ణ                 రాచకొండ విశ్వనాధశాస్త్రిగారు రాసిన మంచి కథల్లో ‘‘వేతనశర్మ’’ కథ కూడా ఒకటి. ఈ కథని ఆయన 1971లో రాశారు. ఈ కథను మొదట ‘ఆంధ్రజ్యోతి’ వారపత్రికలోనూ, తర్వాత ‘బాకీ కథలు’ సంకలనంలోనూ, ‘ఉపాధ్యాయ 2004’, సంకలనంలోనూ ప్రచురించారు.                 పాలకయంత్రపు రథాన్ని సజావుగా నడిపించే కర్తవ్యం, ఏ దేశంలోనైనా ఉద్యోగవర్గానిదే. ఐయ్యేయెస్సులు మొదలుకొని, పంచాయితీ ఆఫీసు ప్యూన్ల వరకు…. ఇంకా చెప్పాలంటే నేటి ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామపంచాయితీ వలంటీర్ల వరకు ఈ కర్తవ్యాన్ని
Complete Reading

– డా. కే.వి. రమణరావు           కారును సైడురోడ్లోకి తిప్పి పార్కింగ్‌ కోసం వెతుకుతున్నాడు జైరాజ్‌. జేబులో ఫోను రెండుసార్లు మోగి ఆగిపోయింది. ఇళ్ల యజమానులు వీధినే పార్కింగ్‌ లాట్‌గా మార్చుకొని రోడ్డుకు రెండువైపులా వాళ్ల కార్లు పెట్టుకున్నారు. చివరకు ఒక ఇంటిముందు గేటుకడ్డంరాని ఖాళీ కనపడింది. ‘ఇంటివోనరు చూసాడంటే తిట్లు తప్పవు, డ్రైవర్లంటే అందరికీ అలుసే. మాలాంటివాళ్లను గౌరవంగాజూసే రోజెప్పుడన్నా వస్తుందా’ అనుకుంటూ అక్కడ కారుపెట్టి గబగబా నడిచి అతని ఇల్లున్న సన్నటి సందులోకి తిరిగాడు.
Complete Reading

          వేలాదిమంది విద్యార్థులకు తెలుగు భాష, సాహిత్యాలను శాస్త్రీయంగా బోధించిన, వందలాది పరిశోధకులకు మార్గదర్శకులుగా పనిచేసిన మార్క్సిస్టు సాహితీ విమర్శకులు ఆచార్య కోవెల్‌ కందాళై రంగనాథాచార్యులు (80) కోవిడ్‌తో 15-5-2021న హైదరాబాద్‌లోని తార్నాకలో మరణించారు. ఆయన 14-6-1941న తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో జన్మించారు.           ఆయన విశ్లేషణాత్మక రచనలు, గంభీరమైన ప్రసంగాలు, చతురోక్తులతో సాగించే సంభాషణ… ఏదైనా… ఆలోచింపచేసేవిగా, విజ్ఞానదాయకంగా, వివేచన కలిగించేవిగా ఉండేవి. విప్లవ రచయితల సంఘం, జనసాహితి వ్యవస్థాపకులలో ఒక ముఖ్యుడైన జ్వాలాముఖి, కె.కె.ఆర్‌
Complete Reading

Create Account



Log In Your Account