‘నాస్తిక కేంద్రం’ నాయకులు డా॥ విజయం మరణం

‘నాస్తిక కేంద్రం’ నాయకులు డా॥ విజయం మరణం

          అంటరానితనానికి వ్యతిరేకంగా, జోగిని – బసివిని దురాచారాలకు వ్యతిరేకంగా, కులాంతర వివాహాలను, నాస్తికత్వాన్ని ఒక ఉద్యమంగా కొనసాగించిన గోరాగారి కుమారుడు. డా॥ విజయం తన 84వ ఏట 22 మే 2020న అనారోగ్యంతో విజయవాడలో మరణించారు. ఆయన 1 డిశెంబరు 1936న జన్మించారు.

         నాస్తికత్వం అంటే ఒక జీవన విధానం అనీ, శాస్త్రీయ దృక్పథం అని నిరంతరం ప్రచారం చేసిన ఆయన ఇతర దేశాలలోని నాస్తిక సంఘాలతో నిత్య సంబంధాలు పెట్టుకొని, అక్కడి జర్నల్స్ కి ఆర్టికల్స్‌ రాసేవారు. ‘నాస్తికమార్గం’ పత్రికను క్రమం తప్పకుండా నిర్వహించారు. అందరితోనూ సత్సంబంధాలు నెరపుతూ ప్రజాసంఘాల కార్యక్రమాలలోనూ భాగస్వాములయ్యేవారు. విజయవాడలో ప్రపంచ నాస్తిక మహాసభలను పలు పర్యాయాలు నిర్వహించారు. విజయంగారి మృతికి ‘ప్రజాసాహితి’ సంతాపం ప్రకటిస్తోంది. ఆయన కుటుంబసభ్యులకు సానుభూతిని తెలియచేస్తూంది.

admin

Related Posts

leave a comment

Create Account



Log In Your Account