ఆచార్య పి. సి. నరసింహారెడ్డి

          శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో భాషాశాస్త్రాధిపతిగా చేసిన ఆచార్య పి.సి. నరసింహారెడ్డి తన 77వ ఏట 19 అగస్టు 2020న హైదరాబాదులో మరణించారు. ఆయన గద్వాల సమీపంలోని గట్టు మండలంలోని పెంచుకలపాడులో 3 జులై 1943లో జన్మించారు.           యువకునిగా వీరు ‘‘తిరగబడు’ కవుల్లో ఒకరిగా ఆ కవితా సంకలనంలో ‘ఐ’ అనే కలంపేరుతో ‘తిరగబడు’ అనే కవిత రాశారు. విరసం ఏర్పాటుతో సంబంధాలు వున్నా, సభ్యత్వం తీసుకోలేదు. ‘శుక్తి’ పేరుతో చిత్రకారునిగా చిత్రాలు గీశారు. ‘సృజన’
Complete Reading

          బహుజన ఉద్యమకారుడిగా కృషిచేస్తూన్న ఉప్పుమావులూరి సాంబశివరావు 24 జూలై 2020న కరోనా వ్యాధితో హైదరాబాద్‌లో మరణించారు. ఆయన గుంటూరుజిల్లా బ్రాహ్మణ కోడూరులో జన్మించారు.           ఉ.సా. తెనాలిలో డిగ్రీ చదివే రోజుల్లో (1973-74) ఏర్పడిన ‘అరుణోదయ సాంస్కృతిక సంస్థ’లో చేరి సామాజిక అంశాలపై కళారూపాలను నేర్చుకుంటూ, నేర్పుతూ – వివిధ సమస్యలపై పాటలు రాశారు. 1978లో జనసాహితి ఏర్పడినపుడు చురుకైన కార్యకర్తగా కృషిచేస్తూ పలు జనం పాటలు రాశారు. జనసాహితి సంస్థ గీతంగా పాడుకునే ‘‘మేం
Complete Reading

          నవయుగ ఫిల్మ్స్‌ మేనేజర్‌గా పనిచేసి, చలనచిత్ర ప్రకటనలలో, ప్రచారంలో వినూత్నమైన విజయవంతమైన ప్రయోగాలు చేసిన అభ్యుదయవాది కాట్రగడ్డ నరసయ్య తన 96వ ఏట – 31 అగస్టు 2020న విజయవాడలో మరణించారు.           విజయవాడలో ప్రముఖ కమ్యూనిస్టు కుటుంబమైన కాట్రగడ్డ కుటుంబసభ్యుడైన నరసయ్య బెనారస్‌ హిందూ యూనివర్శిటీలో విద్యార్థిగా వున్నపుడే – 1943లో తెనాలి సమీపాన పెదపూడి గ్రామంలో ఆంధ్ర అభ్యుదయ రచయితల సంఘం నెల రోజులపాటు నిర్వహించిన సాహిత్య పాఠశాలకు హాజరయ్యారు. నవయుగలో పనిచేశారు.
Complete Reading

          ప్రముఖ రచయిత, చిత్రకారుడు కలువకొలను సదానంద తన 81వ ఏట 25 ఆగస్టు 2020 ఉదయం పాకాలలో మరణించారు. ఆయన 22 ఫిబ్రవరి 1939లో పాకాలలో జన్మించారు.           సదానంద కథ, నవల, గేయాలు మొదలగు ప్రక్రియలలో బాలసాహిత్యాన్ని ప్రధానంగా రచించారు. చిత్రకారునిగా, కార్టూనిస్టుగా కూడా పాఠకులకు వీరు పరిచయం. ‘రక్తయజ్ఞం’, ‘పైరుగాలి’, ‘మాయకంబళి’, ‘నవ్వే పెదవులు, ఏడ్చే కళ్ళు’ వీరి కథాసంపుటాలు. ‘గాడిద బ్రతుకులు’, ‘గందరగోళం’ వీరి నవలలు. ఆయన రచించిన ‘అడవి తల్లి’
Complete Reading

          భారత నాస్తిక సమాజ వ్యవస్థాపక సభ్యురాలు, జయగోపాల్‌ భార్య శారదమ్మ 29 ఆగస్టు 2020న విశాఖలో చనిపోయారు.           గత 50 ఏళ్ళకుపైగా జయగోపాల్‌తో పాటు నాస్తికోద్యమపు ఎగుడుదిగుడు ప్రయాణం చేసిన శారదమ్మ మరణానికి ‘ప్రజాసాహితి’ సంతాపం తెలియచేస్తూంది. వారి కుటుంబసభ్యులకు సానుభూతి ప్రకటిస్తున్నాం.

          ఏ.పి.టి.ఎఫ్‌.లోను, జనసాహితిలోనూ, రాయలసీమ ఉద్యమంలోనూ క్రియాశీలకంగా పనిచేసిన ఉపాధ్యాయుడు, రచయిత, ఉద్యమ కార్యకర్త బి. పాండురంగారెడ్డి తన 74వ ఏట ఆగస్టు 3, 2020న కరోనా వ్యాధితో మరణించారు. ఆయన నంద్యాల సమీపంలోని గోవిందపల్లెలో 1946లో జన్మించారు.           పాండురంగారెడ్డి తిరుపతిలో విద్వాన్‌ చదివి 1968లో మొలగపల్లి గ్రామంలో ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించారు. అప్పటి నుండి ఎ.పి.టి.ఎఫ్‌లో చురుకైన పాత్ర పోషించారు. ఏపిటిఎఫ్‌ బాధ్యతలతో పాటుగా 1992-2006 నడుమ ఉపాధ్యాయ పత్రిక సంపాదకవర్గ బాధ్యతలు నిర్వహించారు.
Complete Reading

          ప్రజాకళాకారుడు వంగపండు ప్రసాద్‌ గుండెనొప్పితో విజయనగరం జిల్లా పార్వతీపురం వై.కే.ఎం. నగర్‌లో 4-8-2020న మరణించారు. ఆయన విజయనగరంజిల్లా పార్వతీపురం మండలంలోని బొండపల్లి గ్రామంలో జన్మించారు.           వంగపండు ఆదివాసీలు, ఇతర పీడిత ప్రజల సమస్యలు, బాధలు కన్నీళ్ళతోపాటు పోరాటాలను కూడా గానం చేస్తూ అనేక పాటలు రాశారు. ఆయన రచించిన ‘సుత్తీ కొడవలి ఎత్తిన జెండా’ పాటను 1977లో ప్రజాసాహితి ప్రచురించింది. ఎమర్జన్సీ కాలంలో ఆయన రచించిన ‘భూమి భాగోతం’ కళారూపాన్ని అనేక బృందాలు, ప్రదర్శించాయి.
Complete Reading

          స్వామి అగ్నివేశ్‌ ఆర్యసమాజం ఆశయాలను కొనసాగిస్తూ ‘ఆర్యసభ’ అనే రాజకీయ పార్టీని ఏర్పాటుచేశారు. హర్యానా రాష్ట్రం నుండి కాబినెట్‌ మినిష్టర్‌గా ఎన్నికయ్యారు. విద్యాశాఖమంత్రిగా పనిచేశారు. ప్రజల ప్రజాస్వామిక హక్కుల కోసం కృషిచేసిన ఆయన 11-9-2020న ఢిల్లీలో కాలేయ వ్యాధితో మరణించారు. అగ్నివేశ్‌ 21-9-1939న శ్రీకాకుళంలో జన్మించారు.           హిందూమతంలోని దురాచారాలను వ్యతిరేకిస్తూ ఆర్యసమాజంలో చేరారు. ప్రజాస్వామిక హక్కుల కోసం ఉద్యమిస్తున్న అగ్నివేశ్‌ను 2008లో ఆర్యసమాజం బహిష్కరించింది. ఢిల్లీ పరిసర ప్రాంతాలలోని గనుల్లో సాగుతున్న వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా
Complete Reading

          ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాకాటి శిరీష్ కుమార్ నున్నలో వారి స్వగృహము నందు 9-8-2020న మరణించారు. ఆయన కృష్ణాజిల్లా నున్నలో జన్మించారు.          ‘సంస్కృతీ సమాఖ్య’ అనే పేరుతో సాహిత్య సాంస్కృతిక సంఘాన్ని నిర్వహించిన శిరీష్ కుమార్ నాలుగు దశాబ్దాలకు పైగా యువ రచయితలను, కవులను ప్రోత్సహించారు. ‘ప్రజాసాహితి’కి మిత్రులు. శిరీష్ కుమార్ మృతికి ‘ప్రజాసాహితి’ సంతాపం ప్రకటిస్తోంది. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తుంది.

          అభ్యుదయ, నాస్తికోద్యమ భావవ్యాప్తిలో ఇంద్రజాల కళను జోడించి మూఢవిశ్వాసాలను పారద్రోలుతూ ప్రజల్ని చైతన్యపర్చటంలో అలుపెరుగని కృషిచేసిన ప్రొ॥ ఎన్‌. విక్రం కోవిడ్‌-19 వ్యాధితో హైదరాబాదులో 4-7-2020న మరణించారు. ఆయన 3-9-1947న రంగూన్‌లో జన్మించారు.           హిప్నాటిజం, ఇంద్రజాల కళలపట్ల అత్యంత ఉత్సాహం వున్న విక్రంకు భారత నాస్తిక సమాజంతో అనుబంధం ఏర్పడింది. ఆయన వృత్తి రీత్యా టెక్నికల్‌ ఉద్యోగి అయినా, సమాజాన్ని పట్టి పీడిస్తున్న మూఢనమ్మకాలు మానసికజాడ్యంగా రూపొందుతున్న విధానాలపైన నిరంతరం పోరాడారు. బాణామతి వంటి
Complete Reading

Create Account



Log In Your Account