నేటి విచ్ఛిన్న సంస్కృతిలో యువత ఎదుర్కొంటున్న సవాళ్ళు!

నేటి విచ్ఛిన్న సంస్కృతిలో యువత ఎదుర్కొంటున్న సవాళ్ళు!

ఉపఖండం యువతకు నెత్తురు మండే, శక్తు నిండిన నిువెత్తు ప్రతినిధిగా కనిపించే భగత్‌సింగ్‌ చెప్పినట్లుయవ్వనంలో మనిషికి రెండే రెండు మార్గాు. అయితే అతను ఔన్నత్యపు ఉన్నత శిఖరాన్ని అధిరోహించనూ వచ్చుÑ లేదా అధః పాతాళపు చీకటి కందకంలో పడిపోనూవచ్చు. ఒకనాటి చరిత్ర పుటల్ని తిరగేస్తుంటే దేశంకోసం, ప్రజకోసం జీవిత సర్వస్వాన్నీ గడ్డిపరకలా తీసిపారేసి, రక్త ప్రభంజనంతో ఒక యువ మార్క్స్‌, ఒక నవ గోర్కీ, ఒక గరిమెళ్ళ, ఒక అూ్లరి, ఒక ఓస్ట్రవ్‌స్కీ, ఒక మైకోవ్‌స్కీ, ఒక కం సైనికుడు శ్రీశ్రీ, ఒక చేత్తో కం, మరోచేత్తో తుపాకీ పట్టిన ఒక సుబ్బారావు పాణిగ్రాహి, ఒక క్రిస్టోఫర్‌ కాడ్వెల్‌, ఒక పాబ్లో నెరుడా, జేమ్స్‌ జాయిస్‌, మంటో.... వీళ్లంతా నూనూగు మీసా నూత్న యవ్వనంలో నిప్పు చిమ్ముకుంటూ నింగికి ఎగిరిన మిస్సైళ్ళు! జాతీయోద్యమ కాంలో భారత ఉపఖండం ప్రసవించిన నిప్పు కొండకు లెక్కేలేదు. ఆనాటి యువత ముందు దేశ పరిస్థితు అట్టుడుకుతూ వుండేవి. ప్రజ జీవితాల్లో గాయాకు కారణమైన శత్రువు స్పష్టంగా కనిపించేవాడు. దేశభక్తి అంటే ఖచ్చితమైన నిర్వచనం వుంది. ఉద్వేగం వుంది. జీవితానికొక క్ష్యం వుంది. కానీ ఇవాళ కనిపించని శత్రువు అనేక కోణా నుండి ఆర్ధికంగా, రాజకీయంగా, సామాజికంగా, సాంస్కృతికంగా, విచ్ఛిన్న రసాయనాను విరజిమ్ముతున్నాడు. ఈనాటి యువతరానికి తన సమస్యపట్ల అవగాహన కల్గివుండే స్పష్టతనివ్వని విధ్వంసక విధానాు విచ్చవిడిగా కమ్ముకొని వున్నాయి. క్ష్యశూన్యతలో కొట్టుమిట్టాడుతున్న కుర్రకారు రోజుకో కొత్త సంవత్సర వేడుక పొంగుల్లో క్షణిక భావోద్రేకా పొంగుల్లో, పొగలో, పబ్బుల్లో, క్లబ్బుల్లో, మత్తులో, మాదకద్రవ్యాల్లో, కుమతా తిరుగు గుమ్ముల్లో కొట్టుమిట్టాడుతున్నారు. దేశం ఇంజనీర్లతో, సాఫ్ట్‌వేర్‌ మేధో కూలీతో పరిశోధక విద్యార్థుతో, విద్యాధిక్యతతో ఎంత విరగపండి పోతుందో, సాంస్కృతికంగా అంత పతన మివ మురుగులో పడుతోంది.
మార్కు, ర్యాంకు అంటూ మివైన విద్యార్థి జీవితమంతా పుస్తకా పిరమిడ్‌లో సమాధి అయిపోతూ తీరా ప్రపంచ వాస్తవికతలోకి అడుగుపెడితే కాణీకి ఠికాణాలేని మివలేని పట్టాతో దారి లేక, ఉపాధి రాక జీవితానికి గమ్యం కనిపించక, కెరీరిజం కోరల్లో కొట్టుమిట్టాడే నేటి తరానికి ఉమ్మడి క్ష్యాు లేవు. సమష్టి స్వభావం లేదు. సంఘటితత్వం లేదు. అలా విడివిడిగా, పొడిపొడిగా, శకలాు శకలాుగా పగిలిన గాజుముక్కల్లాగా జాతి భవిష్యత్తు బాటలో చెల్లా చెదురుగా పడవేస్తున్న దేశ రాజకీయ, ఆర్థిక విధానాను ప్రశ్నించడానికి ఇక్కడి నవతరాన్ని సిద్ధం చేయలేకపోవడమే పెద్ద విషాదం. ఒక తరం అడుగు తడబడితే, మరో తరం అణగారిన ఆర్తనాదాు కొనసాగించబడతాయి. వాళ్ళ ఆలోచను భ్రమ పడుతున్నాయి. ఇవే పరిస్థితు కొనసాగు తున్నంతకాం భారత సమాజానికి ఈ వేదను తప్పవు. దళితుకు కేటాయించిన రిజర్వేషన్లతో వారి నిరుద్యోగ సమస్య పరిష్కారమయిపోయినట్లేనని ప్రచారం చేసిన పాకవర్గాలే నిరుద్యోగ సమస్యకు దళితుకిచ్చిన రిజర్వేషన్లే కారణమన్నట్లు అగ్రకులా మధ్యతరగతికి చెప్పారు. నిజానికి రిజర్వేషన్లు అనేవి ఉద్యోగావకాశాను పెంచవు. పంచుతాయి. అంతవరకే! నిరుద్యోగానికి మూకారణమైన వ్యవసాయ పారిశ్రామిక రంగా సంక్షోభాన్ని పరిష్కరించకుండా ప్రశ్నించే యువతరాన్ని పక్కదారి పట్టించే ప్రచారాకు ఒడిగడుతున్నారు. ఇప్పుడు కులావారీ రిజర్వేషన్లే పరిష్కారమన్న భ్రమల్ని పాకపక్షాలే పెంచి పోషిస్తున్నాయి. తద్వారా కులా కుంపట్లను రాజేసి తమతమ కుస్తు మాత్రమే అణగారి పోతున్నట్లు మిగిలిన అందరూ అభివృద్ధి పధంలో దూసుకుపోతున్నట్లు భ్రమాత్మక భావాను పోషిస్తున్నారు. నిరుపేదలో 100కి 73 మందికుండిన మొత్తం సంపద కేవం నూటికి ఒక్కరి సంపన్నవర్గా గుప్పెటనున్న సొత్తుతో సమానమైతే ఇక్కడ అన్ని కులా పేదు, మధ్యతరగతి మొత్తంగా ఉమ్మడిగా కునార్లిుతున్నారని గ్రహించాలి. ఈ ఎరుకను కుగనీయకుండా పాకవర్గాు జాగ్రత్తపడుతున్నాయి.
సినిమా వ్యాపారానికీ పదవీ జూద అరాచకాకీ, పెద్ద బజార్లకీ రికామీ తిరుగుళ్ళకీ నెత్తుటి వసంత ఋతువుని తాకట్టు పెడుతున్న పాక విధానాపై సుదీర్ఘ యుద్ధం ప్రకటించాల్సి ఉంటుంది. కానీ నేటి చదువు ఆ ఎరుకని ఇవ్వవు. కాలేజీ వాతావరణం విశ్వవిద్యాయా ఆవరణం కాషాయీకరణతో ‘‘దేశభక్తి’’ భావజాంతో నెత్తుటి వాసన తెస్తున్నాయి. ‘‘ప్రేమ’’ పేరుతో చిత్తకార్తె సంస్కృతిని పెంచి పోషిస్తున్న మిథ్యా విద్యా‘యాు’ ప్లిల్లో నేరస్త ఉద్వేగాల్ని రెచ్చగొట్టే మాఫియా కేంద్రాుగా మార్చే ప్రక్రియ నడుస్తోంది. వారాంతపు వినోద హింసతో, రేవ్‌ పార్టీతో, సుభ మార్గాల్లో డబ్బు పొంగుల్తో ముఠా పోరాటా హంతక సంస్కృతితో, విలాసాకు, బహీనతకీ బానిసలైపోయిన, రికామీ కుర్రకారు విద్యాధికులైనా, చెయిన్‌స్నాచర్స్‌గా, ‘‘డబ్బు కావాంటే ఏమైనా చెయ్యవచ్చు’’ అనే హీన తాత్వికతతో లోలోన కుళ్ళిపోతున్నారు పైపైకి మేడిపళ్ళుగా నవనవ లాడుతున్నారు. మరోపక్క పేదరికంలో మగ్గే యువత అవకాశా కోసం పోటీపడుతూ ఏదో ఒకటి చెయ్యాలి అనే కసితో జీవితంతో రాజీపడలేక, బతుకుతో పోరాటం చెయ్యలేక నిస్తేజానికీ, నిస్సహాయతకీ, అసంతృప్తికీ గురై మూఢనమ్మకా ఊబిలో కూరుకుపోతున్నారు. క్షుద్ర భావజాలాన్ని ఆశ్రయిస్తున్నారు. అయ్యప్ప భక్తుగా, భవానీ దీక్షతో గుళ్ళూ గోపురా చుట్టూ, రాళ్ళూ రంగుతాళ్ళూ కట్టుకొని, చుట్టుకొని చీకటి లోయల్లో గిరికీు కొడుతున్నారు. ఒకనాటి చైనా, రష్యా యువకు త్యాగపూరిత విప్లవ అనుభవాు ఇప్పుడు కాంచెల్లిన భావజాంగా నెట్టిపారేస్తున్నారు. ఒకనాటి బోల్షివిక్‌ మహిళ చైతన్యం, ప్రపంచ యువత మీద చూపించిన ప్రభావాు ఇవాళ ప్రమాదకరమైనవిగా ప్రచారం చేస్తున్నారు. సామాజిక చన సూత్రాపై అవగాహనలేని ప్రాప్తకాజ్ఞతలో యువత గుడుగుడుగుంచం ఆడేలా, గానుగెద్దుల్లా, గుర్తింపు కెరీరిజానికీ, స్వసుఖవాదానికీ పరిమితమయ్యేలా దేశ ఆర్థిక, రాజకీయ చట్రాన్ని దళారీ బూర్జువా పాక ముఠాు బిగించి వుంచాయి. ఎందుకంటే
యువత ఒకటై కదిలితే రాకపోకు స్థంభిస్తాయ్‌!
యువత ఆగ్రహిస్తే ఆకాశహర్మ్యాు నెర్రలిస్తాయ్‌!
యువత కళ్ళెర్రజేస్తే సంకెళ్ళు బద్ధవుతాయ్‌!
యువత పూనిక వహిస్తే దేశ పతాకలే అవనతమవుతాయ్‌!
ఆ మహోదయం కోసం దేశం దేశం అంతా చిమ్మ చీకటిలో తూర్పులా పోరాట సహనంతో పురిటినొప్పు పడుతోంది!!

231218

admin

leave a comment

Create Account



Log In Your Account